గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన
- ఆరెస్సెస్ను స్థాపించి వందేళ్లు
- సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు
- ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన
- కరీంనగర్లో నేడు అధికారికంగా పాటల విడుదల
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను స్థాపించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ గాయకుడి అవతారమెత్తారు. సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఆ సంస్థ గీతాలను ఆలపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పుడీ ప్రోమో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు (శుక్రవారం) ఈ పాటలను కరీంనగర్లో విడుదల చేయనున్నారు. బండి సంజయ్ పాడిన పాటలకు వందేమాత్రం శ్రీనివాస్ సంగీతం అందించినట్టు తెలిసింది. బండి పాటకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయన స్వరం బాగుందని ప్రశంసిస్తున్నారు.